మర్రిగూడ మార్చి 21 (ఆంధ్రప్రభ): శివన్నగూడ గ్రామంలో అనారోగ్యం కారణంగా ఆపరేషన్ చేయించుకున్న గ్రామానికి చెందిన లపంగి సుదర్శన్ కూతురు లపంగి వాణిని గ్రామ సర్పంచ్ రాపోలు యాదగిరి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలి పరిస్థితిని తెలుసుకుని ఆమెకు రూ.20,000 ఆర్థిక సాయం అందించారు. కుటుంబ పరిస్థితిని మునుగోడు నియోజకవర్గ శాసన సభ్యులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ పూల సతీష్, మాజీ వార్డ్ మెంబర్ వాయిల్ల సోమయ్య, బొమ్మగొని మహేష్, ఇరగదిండ్ల సత్తయ్య పాల్గొన్నారు.
business
అనారోగ్య బాధితురాలికి ఆర్థిక సాయం
By Hari Krishna24 Mar 2026

Related stories
More in businessComments (0)
No comments yet. Be the first to comment.
